కొన్ని విషయాలు తెలియకుండా జరిగినా అవి మనల్ని చాలా దెబ్బతీస్తుంటాయి. అమెరికాలోని బ్యాంకుల పతనం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా భారంగానే పరిణమిస్తుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు షేర్ల పతనంతో ఇండియాలోని స్టార్టప్ కంపెనీలు ఇబ్బందులు పడ్డాయి. అమెరికా సిగ్నిచర్ బ్యాంకుకు సంబంధించి ఒత్తిడి తేవడంతో స్విట్జర్లాండ్ బెయిల్ అవుట్ ప్రకటించింది.


దాదాపు అయిదున్నర మిలియన్ డాలర్లు, వేల కోట్ల రూపాయాలు అవుతాయి. సిగ్నిచర్ బ్యాంకు మూతపడి ఉంటే భారత్ లో కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చేవని తెలుస్తోంది. అనేక కంపెనీలకు ఈ బ్యాంకు ఫండ్స్ అందజేస్తుంటుంది. అదృష్టవశాత్తు అమెరికా తొందరగా నిర్ణయం తీసుకోవడంతో అమెరికాతో పాటు భారత్ లో కూడా ఇబ్బందులు రాకుండా ఆపగలిగింది. అయితే స్విట్జర్లాండ్ ను అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయాలని ఒత్తిడి చేసింది. దీనికి స్విట్జర్లాండ్ ససేమిరా అంది. ఈ విషయంలోనే  యూరప్ దేశాలు ప్రస్తుతం దివాలా తీశాయి.


ప్రస్తుతం రష్యా చెబుతున్న విషయం ఏమిటంటే స్విట్జర్లాండ్ ను ఆయుధాలు ఇమ్మని అమెరికా ఒత్తిడి చేస్తుంది. ఇది సరైనది కాదని రష్యా అంటోంది. న్యూట్రల్ గా ఉన్న స్విట్జర్లాండ్ ను ఒత్తిడి తెచ్చి ఆయుధాలను ఇవ్వాలని కోరడం అనైతికమని రష్యా అమెరికాను విమర్శిస్తోంది. బ్యాంకుల విషయంలో జరిగినట్లు ఇక్కడ కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చి యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను ఇస్తే బాగుంటుందని కోరుతుంది. ఇదే గనక జరిగితే అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని రష్యా హెచ్చరించింది.


బ్యాంకుల విషయంలో కాబట్టి రష్యా విడిచిపెట్టింది. యుద్ధంలో కావాల్సిన ఆయుధాలను ఇవ్వమంటే ఎలా ఇస్తారు. ఇచ్చిన రష్యా ఊరుకుంటుందా. ఇప్పటికే పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చిన వారిని విడిచిపెట్టేది లేదంటున్నాడు. ఇలాంటి సమయంలో న్యూట్రల్ గా ఉన్న స్విట్జర్లాండ్ ను బురదలో కి దించి రాక్షసానందం పొందాలని అమెరికా చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: