ఈ రోజుల్లో మనలో చాలా మంది కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి సమయం తక్కువగా ఉండడం వల్ల సరిగ్గా నిద్రపోరు.  మరికొందరు ఏమో సమయం ఉన్నప్పటికి నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని మనందరికి తెలిసిందే. అయితే తాజా పరిశోధనల ప్రకారం నిద్రలేమి అనేది ఖచ్చితంగా క్యాన్సర్ కు  కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.తక్కువగా నిద్రపోయే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఈ అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. రాత్రిపూట ఉద్యోగాల కారణంగా చాలా మంది మధ్యాహ్నం 12 గంటల తరువాత నిద్రపోతున్నారు. ఇంకా అలాగే పనిలేకపోయినా కూడా ఫోన్స్ వాడుతూ చాలా మంది రాత్రి 10 నుండి 12 గంటల మధ్యలో నిద్రపోతున్నారు. మళ్ళీ త్వరగా మేల్కొంటున్నారు. అందువల్ల చాలా మందికి తగినంత నిద్ర సరిపోవడం లేదు. శరీరంలో సిర్కాడియన్ రిథమ్స్ అని పిలువబడే 24 గంటల అంతర్గత గడియారం అనేది ఉంటుందట.


నిద్రతో పాటు ఎన్నో విధులను నిర్వర్తించే ఈ గడియారంలో మార్పు రావడం వల్ల పెద్దప్రేగు, అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేస్ క్యాన్సర్ ఇలా చాలా రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  రాత్రి ఉద్యోగాల కారణంగా ఎక్కువ సమయం దాకా మేల్కొని ఉంటున్నారు. అందువల్ల మనం నిద్రించే ఇంకా మేల్కొనే చక్రాల మధ్య మార్పు వస్తుంది.ఇలా మార్పు రావడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ది చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం ప్రతి రోజూ తగినంత నిద్రించడం చాలా అవసరం. ప్రతి రోజూ కనీసం ఖచ్చితంగా 7 గంటల పాటు నిద్రపోవాలి. అలాగే నిద్రించే ముందు సెల్ ఫోన్స్ చూడడం, టివీలు, ల్యాప్ టాప్ వంటి చూడడం తగ్గించాలి. బెడ్ రూమ్ లో ఖచ్చితంగా నిద్రకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అలాగే నిద్రపోయే ముందు కెఫిన్ ఉండే పానీయాలను తీసుకోవడం కూడా తగ్గించాలి. మనకు చక్కగా నిద్రపట్టడానికి నిద్రించే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం ఉండేలా కూడా చూసుకోవాలి. ఈ విధంగా వివిధ రకాల చిట్కాలను పాటిస్తూ రోజూ 7 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: