మనలో చాలామంది ప్రతిరోజు కచ్చితంగా ఏదో ఒక సందర్భంలోనైనా ఆహారంగా అన్నం తింటూ ఉంటాము. ముఖ్యంగా చాలామంది ప్రజలు బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికి మక్కువ చూపుతూ ఉన్నారు. చాలా రాష్ట్రాలలో బ్రౌన్ రైస్, వైట్ రైస్ అనే రెండు రకాల బియ్యాన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి కొంతమంది ప్లేయిన్ రైస్, జీరా రైస్ వంటి వాటిని కూడా ఇష్టపడుతూ తింటున్నారు. అయితే అన్నం వండడం అనేది చాలా సులువైన పద్ధతి చాలా తక్కువ సమయంలోనే ఇది పూర్తి అవుతుంది.


అందుకే ప్రజలు కూడా వీటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అన్నం వండే ముందు చాలామంది బియ్యాన్ని కడగడం గమనిస్తూ ఉంటాము.. అయితే ఎన్నిసార్లు కడగాలి అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఎందుకంటే కొందరు బియ్యాన్ని చాలాసార్లు కడుగుతూనే ఉంటారు. మరి కొంతమంది చాలా తక్కువగా కడుగుతూ ఉంటారు.. ఈ విషయం పైన నిపుణులు ఏం చెబుతున్నారంటే.. అన్నం వండడానికి ముందు ప్రజలు చాలా పెద్ద తప్పు చేసే పని ఏమిటంటే.. అన్నం వండడానికి ముందు బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టి ఆ తర్వాత చాలా సార్లు కడుగుతూ ఉంటారు..


బియ్యాన్ని పదేపదే కడగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు కూడా నశిస్తాయట. బియ్యంలో ఉండే ఫైబర్ నీటిలో కరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ముఖ్యంగా నీళ్లలో నానబెట్టిన తర్వాత ఆ గంజిని బయటికి పారివేయకుండా తాగడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. బియ్యాన్ని నానబెట్టి కడిగితే అన్నంలోని పోషకాలు  కూడా తొలగిపోతుంది.. అన్నం వండే ముందు బియ్యాన్ని మూడుసార్లు కడిగిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల లోపు నానబెట్టి అన్నాన్ని ఉడికించడం మంచిది.. ఇలా వండుకొని తినడం వల్ల బియ్యంలో ఉండే పోషక ఆహారాలన్నీ కూడా మనకి అందుతాయి. ప్రెజర్ కుక్కర్లో రైస్ ని ఉడికించడం వల్ల అన్ని పోషకాలు సమృద్ధిగానే  ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: