ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోకి ప్రపంచాన్ని దగ్గర చేసే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.ఈ రోజుల్లో యువత ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లేని రోజుల్లో ప్రజలు అప్పట్లో ఉన్న మాములు ఫోన్లకు కూడా ఇంతలా అడిక్ట్ కాలేదు.కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు చాలా పూర్తిగా మారిపోయాయి. అసలు స్మార్ట్ ఫోన్ లేకుండా  ఏ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది.ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా సగం పనులు ఎక్కువగా ఫోన్లతోనే జరుగుతున్నాయి.కొందరైతే గంటల కొద్ది స్మార్ట్ ఫోన్ చూడటంలోనే ఎక్కువగా మునిగిపోతున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ అలవాటు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.ఉదయం నిద్ర లేవగానే ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌ల్లను చాలా మంది కూడా ఎక్కువగా చెక్ చేసుకుంటాయి.ఇంకా అలాగే సోషల్ మీడియాలో వచ్చే అప్‌డేట్లను కూడా ఎక్కువగా చూస్తుంటారు.


అయితే ఈ సందేశాల వల్ల అనవసరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటివల్ల మనసులో ప్రతికూలతలు పెరుగుతాయని దీంతో ఆ రోజంతా కూడా దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి చాలా రకాల సమాచారం కోసం వెతుకుతుంటారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మెసేజ్‌లు రీల్స్ చూస్తూ అలాగే ఉండిపోతారు. అయితే వీటి ప్రభావం ఖచ్చితంగా మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా అలాగే కంటి ఆరోగ్యము కూడా దెబ్బతింటుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.ప్రతి మనిషికి ప్రతిరోజూ ఖచ్చితంగా మంచి నిద్ర అవసరం. కానీ రాత్రి చాలాసేపటి దాకా చాలామంది ఫోన్‌లోనే మునిగిపోతారు. నిజానికి ఈ మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హర్మోన్ ఉత్పత్తికి అడ్డుతగులుతుంది. ఆ హర్మోన్ మనిషికి నిద్ర రావడంలో చాలా సహయపడుతుంది. ఎక్కువ సేపు ఫోన్ చూస్తే కాంతి చాలాసేపటి దాకా కళ్లపై ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: