సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా  మహేష్ ప్రస్తుతం జక్కన్న సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. నిర్మాత అనిల్ సుంకర మహేష్ నటించిన 1 నేనొక్కడినే సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అనిల్ సుంకర మాట్లాడుతూ టీజర్, ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు కథ తెలిసినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

1 నేనొక్కడినే మూవీ ట్రైలర్ ను మేము రిలీజ్ చేయలేదని  ఆ సినిమా ట్రైలర్ ను ఫ్యాన్స్ కోసం మేము థియేటర్లలోనే ప్రదర్శించి  హీరోతో ఫ్యాన్స్ చిట్ చాట్ నిర్వహించాలని అనుకున్నామని నిర్మాత వెల్లడించారు.  మేము వేదికపైకి వెళ్లే సమయంలో ఒకరు మాట్లాడుతూ ఈ  ట్రైలర్ ప్రదర్శిస్తే సినిమాకు ఓపెనింగ్స్ రావు అని చెప్పారని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

ఆ కామెంట్ల వల్ల మేము ట్రైలర్ ప్రదర్శనను ఆపేశామని ఆయన అన్నారు.  థియేటర్ లో సినిమా చూస్తున్న సమయంలో  హీరోకు ఆ వ్యాధి ఉందని తెలియగానే చాలామంది నిరుత్సాహానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు.  ఆ విషయం అభిమానులకు ముందే తెలిసి ఉంటే  మాత్రం ఇబ్బంది ఉండేది కాదని అనిల్ సుంకర వెల్లడించారు.  అందుకే ట్రైలర్ లో  మేము కాన్సెప్ట్ చెప్పానుకున్నామని నిర్మాత అభిప్రాయపడ్డారు.

అప్పటికే మేము మహేష్ బాబు తో  మేము దూకుడు సినిమాను నిర్మించామని  1 నేనొక్కడినే ఆ సినిమా  రికార్డులను బ్రేక్ చేస్తుందని భావించామని చెప్పుకొచ్చారు. 1 నేనొక్కడినే మూవీ కమర్షియల్ గా ఫ్లాపయినా ఒక వర్గం అభిమానులను ఎంతగానో మెప్పించింది.  ఈ సినిమా కథనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పవచ్చు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: