ఫోర్బ్స్ మేగజైన్ లో స్థానం దక్కించుకోవడంపై కీర్తి సురేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో తనను ఎంపిక చేసిన ఫోర్బ్స్ మేగజైన్ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనను ఇంతగా ఆదరించడం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నానని, అభిమానుల ఆదరాభిమాలు మరువనివని ఆమె పేర్కొన్నారు. ఫోర్బ్స్ మేగజైన్ లో స్థానం సంపాదించిన కీర్తికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మహేశ్ బాబుకు జోడీగా ‘సర్కారు వారి పాట’ కీర్తి నటిస్తున్నారు. అంతేకాదు పలు కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మహానటి తర్వాత అందాల తార కీర్తీ సురేష్ క్రేజ్ దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్లో కూడా పెరిగిపోయింది. చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ స్థానాన్ని సంపాదించుకొని అగ్రతారగా బడా హీరోల సరసన ఆఫర్లను కొట్టేస్తున్నది.
మహానటికి ముందు, తర్వాత ఆమె సాధించిన సక్సెస్లు నిర్మాతలకు భరోసానిస్తుండటంతో అవకాశాలు ఆమెను వెతుక్కొంటూ వస్తున్నాయి.దక్షిణాది ఇండస్ట్రీలో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం చేస్తూ విలక్షణతకు పెద్దపీట వేస్తోంది. ఆమె నటించిన మిస్ ఇండియా సినిమాతో చివరగా వెండితెర మీద కనిపించింది.