
ఓ ప్రముఖ అంతర్జాతీయ చిత్ర నిర్మాణ సంస్థ దీనికి సహ నిర్మాతగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ఇక చెన్నైలో జరిగినఈ చిత్రం ప్రారంభోత్సవానికి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ అతిథిగా వచ్చారంటే కమల్ ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో.. దీనికి ఎంతటి ప్రచారం లభించిందో అర్థం చేసుకోవచ్చు. పలు ఇతర భాషా నటులు కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యమున్న పాత్రల కోసం ఎంపికయ్యారు. విష్ణువర్థన్, అమ్రీష్పురి, నసీరుద్దీన్షా, సత్యరాజ్, నాజర్ తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. కొంత భాగం చిత్రీకరణ కూడా జరుపుకుంది. అప్పట్లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. అయితే ఎందుకనో ఈ చిత్రానికి ఆది నుంచి కష్టాలే ఎదురయ్యాయి. భారీ బడ్జెట్ మూవీ కావడంతో కమల్హాసన్కు ఈ చిత్రంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ చిత్రం కోసం ఇతర చిత్రాలను సైతం కమల్ ఒప్పుకోకపోవడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పలేదు. నెలల తరబడి షూటింగ్ డిలే కావడంతో కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్న మరోసంస్థ మధ్యలోనే కాడి పడేసింది. ఇక ఆ తరువాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ఆ సినిమా ఏమైందో ఎవరికీ తెలియదు.