టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ కథానాయిక గా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఆమె ప్రస్తుతం చిత్రం రాధే శ్యామ్ యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. దీని పై అభిమానులు కూడా తీవ్రమైన నిరాశ తో పాటు ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. ఆల్రెడీ పూజా హెగ్డే తన సినిమాలకు ఇచ్చిన కమిట్ మెంట్స్ కారణంగా ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో నటించ లేక పోతుంది అని అంటున్నారు. 

తాజా అప్డేట్ ప్రకారం పూజ హెగ్డే రాధే శ్యామ్ కు మరొకసారి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను మార్చి 11వ తేదీన విడుదల చేస్తున్న చిత్రబృందం దానికి తగ్గట్లుగానే ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ప్రేమకు విధి కి మధ్య సాగే పోరాటమే ఈ సినిమా. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వెల్లడిస్తున్నారు. 1970 వ సంవత్సర కాలంలో ప్రేమ నేపథ్యంలో కొనసాగే ఈ హెరిటేజ్ రొమాంటిక్ ప్రేమ కథ లో ఎన్నో అద్భుతమైన సీన్స్ ఉన్నాయట. ఈ చిత్రానికి కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయని తెలుస్తుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. విధి ఆడిన వింత నాటకంలో ఎప్పటికీ కలవని ప్రేమికుల అందమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు.  అయితే ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని చిత్రబృందం భావించగా ప్రమోషన్ కార్యక్రమాలకు పూజాహెగ్డే పాల్గొనకపోవడం ఎంతైనా అది మైనస్ అవుతుంది అని చెప్పాలి. ఈ సినిమా కోసం ప్లాన్ చేసిన తర్వాత పూజ హెగ్డే ఇప్పటివరకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. త్వరలోనే ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆమె మాట ఇచ్చిందట. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: