కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం.. kgf -2 ఈ సినిమా ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలై అయ్యి కొన్ని సంచలను సృష్టించింది. ఇటీవల విడుదలైన ఈచిత్రం కొన్ని సరికొత్త రికార్డులను సృష్టించింది. కే జి ఎఫ్ మొదటి పార్ట్ గురించి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది ఈ చిత్రం. రాఖీ బాయ్ హీరోయిజం ముందు టాప్ స్టార్ హీరోలు కూడా నిలవలేక పోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అంత మాస్ హిస్టరీ చిత్రంగా తెలియజేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు అంత ఎక్కువగా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

ఇక బాలీవుడ్ లో మొదటి రోజు 50 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. త్వరలోనే 1000 కోట్ల వరకు ఈ సినిమా అవలీలగా అధిగమిస్తుందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకి ప్రేక్షకులు నటీనటులు సైతం ఫిదా అయిపోయారు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో కూడా హీరో యష్ స్టార్ హీరోగా క్రేజ్ ను సంపాదించారు.

అంతేకాకుండా ఇందులో నటించిన నటీనటులకు కూడా దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఇందులో రమిక సేన్ గా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇందులో ఈమె పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. తాజాగా ఒక థియేటర్లో ఇ సినిమా ప్రదర్శిస్తున్న సందర్భంలో చివరిలో రవీనా టాండన్ kgf చాప్టర్-3 కు సంబంధించి ఒక పేపర్ ను చూపిస్తూ ఉండగా.. ఆ సన్నివేశంలో కొంతమంది ప్రేక్షకులు సైతం రూపాయి కాయిన్స్ వర్షాన్ని వెదజల్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈ వీడియోని రవీనా టాండన్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి దృశ్యం చూశానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: