టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన వేణు ఉడుగుల గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం. వేణు ఉడుగుల ,   శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన నీది నాది ఒకే కథ మూవీ తో దర్శకుడిగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

నీది నాది ఒకే కథ సినిమాతో  వేణు ఉడుగుల మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి దర్శకుడిగా మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.  నాది ఒకే కథ లాంటి మంచి విజయవంతమైన సినిమా తరువాత దర్శకుడు వేణు ఉడుగుల 'విరాట పర్వం' సినిమాకు దర్శకత్వం వహించాడు.  దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలయిన మొదటి షో నుండి మంచి టాక్ ను  తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతూ ఉండడంతో తాజాగా ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ... విరాట పర్వం మూవీ  ప్రేక్షకుల వరకూ రావడానికి కారణం సురేశ్ బాబు గారు మరియు సుధాకర్ చెరుకూరి గారు అని వేణు ఉడుగుల చెప్పుకొచ్చాడు. అలాగే రానా  అందించిన సహకారం  మరిచిపోలేను. ఇక సాయి పల్లవిమూవీ కథను ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. సాయి పల్లవి కనుక ఈ సినిమాలో నటించడానికి అంగీకరించక పోయినట్లయితే నేను విరాట పర్వం మూవీ ని తీసేవాడినే కాదు అని దర్శకుడు వేణు ఉడుగుల చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రియమణి  ఒక కులాల పాత్రలో నటించగా , ఈ సినిమాకు సురేష్ బెబ్బులి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: