కే జి ఎఫ్ సినిమాతో సంచలన దర్శకుడుగా మారిపోయిన
ప్రశాంత్ నీల్ ఇప్పుడు తన తదుపరి సినిమాను చేసే పనిలో పడ్డాడు. చాలా రోజులుగా
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం యొక్క పనులలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తూ ఉండడంతో దీనికి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
కేజీఎఫ్ సినిమా తరహాలోనే ఈ సినిమాను సైతం భారీ యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి తన తదుపరి చిత్రాన్ని చేయాలని
ప్రశాంత్ భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమాను
టాలీవుడ్ స్టార్
హీరో ఎన్టీఆర్ తో చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. ఒక పెద్ద దర్శకుడుతో తమ అభిమాన నటుడు
ఎన్టీఆర్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అని వారిలో
భావన ఉంది అందుకే ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని వారు ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు
అయితే ఈ
సినిమా కోసం
ప్రశాంత్ ఒక ఎప్పుడు చేయనటువంటి పని చేస్తూ ఉండడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ
సినిమా కోసం కొంతమంది
హాలీవుడ్ నటులను తీసుకురాబోతున్నారట అయితే వారు ఏ పాత్ర కోసం నటిస్తున్నారు అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. తొందరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియని ఉన్నాయి. ఏదేమైనా
ప్రశాంత్ నీల్ ఈ
సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడని చెప్పాలి. ఎన్టిఆర్ కూడా ఈ
సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయన
కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే మొదలు కాబోతుంది. కథ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ
సినిమా తర్వాత
ఎన్టీఆర్ చేయబోయే
సినిమా ప్రశాంత్ నీల్ దే అంటున్నారు.