రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం సలార్ ... ప్రాజెక్టు కే ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూడు మూవీ ల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

అలాగే మరి కొన్ని రోజుల్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందబోయే  స్పిరిట్ అనే మూవీ లో కూడా హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్మూవీ ల తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ లో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని దిల్ రాజు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ... దిల్ రాజు కాంబినేషన్ లో మొదటగా మున్నా మూవీ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ప్రభాస్ ... దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన మిస్టర్ పర్ ఫెక్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ మూవీ మరి కొన్ని రోజుల్లో ఉండబోతున్నట్లు దిల్ రాజు తాజాగా ప్రకటించాడు. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా దిల్ రాజు తాజాగా అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పొందుతున్న సలార్ మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: