వాణీ కపూర్ గుర్తుందా.. అప్పుడెప్పుడో తెలుగులో హీరో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’లో సందడి చేసింది. ఆ తర్వాత తెలుగువైపు పెద్దగా చూడలేదనుకోండి.. వాణీ ఈమధ్యనే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లతో కలిసి ‘వార్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న ‘షమ్షేరా’లో వాణీ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
మరి ఈ అమ్మడు ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు ఎక్కిందంటారా.. ప్రస్తుతం వాణీ ఓ వివాదంలో చిక్కుకుంది. ‘హే రామ్’ అంటూ రాసిన టాప్ జాకెట్ బికిని ధరించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలే ఈ మధ్య అయోధ్య తీర్పుతో ఈ అంశం సున్నితంగా మారింది. ఈ సమయంలో ఈ హాట్ అమ్మడు.. జాకెట్ పై రాముడి పేరు రాసుకోవడం కాంట్రావర్సీ అయ్యింది. ఈ ఫోటో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఘాటు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోను వాణీ కపూర్ తన ట్విట్టర్ స్టేటస్ గా పెట్టుకుంది. కానీ ఆ కామెంట్లతో బెదిరిపోయిన వాణీ కపూర్ దాన్ని తొలగించింది. కానీ సోషల్ మీడియాలో ఒక్కసారి పిక్చర్ బయటికి వస్తే ఏమవుతుందో తెలుసా.
ఆ ఫోటో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. నెటిజన్ల కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాణీ ట్విట్టర్లో తొలిగించినా కూడా ఈ ఫోటోతో వాణీకి చెడ్డపేరు తీసుకొస్తోంది. సరదా కోసమో.. ఫ్యాషన్ కోసమో.. వేసుకొన్న డ్రెస్ కారణంగా వాణీ కపూర్కి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ అవుతోంది. ‘మీకు మతం మీద నమ్మకం లేకపోయినా, సంస్కృతి, సంప్రదాయలను గౌరవించక పోయినా ఫర్వాలేదు. కానీ ఇలాంటి డ్రెస్లు వేసుకొని మా మనోభావాలతో ఆడుకోవద్దంటున్నారు నెటిజన్లు .
మేటర్ ఇంత సీరియస్ అవుతందని పాపం వాణీ కపూర్ ఊహించి ఉండదు. వాణీ కపూర్ ప్రస్తుతం కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న షమ్షేరా అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఇది 1800 శతాబ్దానికి చెందిన బ్రిటీష్ వారిని ఎదిరించే బందిపోటు తెగకు చెందిన రియల్ స్టోరీ.