ఎట్టకేలకు కొరటాల శివ నిరీక్షణ ఫలిస్తోంది. చిరంజీవి కోసం దాదాపు ఏడాదికి పైగా ఎదురు చూసిన కొరటాల చిరంజీవితో తీయబోతున్న మూవీ షూటింగ్ ఈనెల 26న కోకాపేట్ లో చిరంజీవికి సంబంధించిన ఫామ్ హౌస్ లో ప్రారంభం కాబోతోంది. గతంలో ‘సైరా’ కోసం వేసిన ఒక భారీ సెట్ ను మార్పులు చేసి ఇప్పుడు చిరంజీవి కొరటాల మూవీకి ఉపయోగిస్తున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ మొదటి షెడ్యూల్ పదిరోజులు జరిగిన తరువాత చిన్న బ్రేక్ తీసుకుని సంక్రాంతి పండుగ హడావిడి ముగిసిన తరువాత ఈ మూవీ షూటింగ్ ను రాజమండ్రికి మారుస్తున్నట్లు టాక్. గతంలో రాజమండ్రి చుట్టుపక్కల చాల సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉండేవి. 

అయితే అవుట్ డోర్ షూటింగ్ ల కోసం ఇతర రాష్ట్రాలు విదేశాలు వెళ్ళడం ఒక అలవాటుగా మారిన తరువాత రాజమండ్రి వైపు వెళ్ళడం టాప్ హీరోలు బాగా తగ్గించివేసారు. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి అలనాటి పాత పద్ధతిని అనుసరిస్తూ తన మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ను రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో తీయబోతున్నట్లు టాక్. 

ఈ మూవీకి ఇప్పటికే ‘ఆచార్య’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేయడంతో పాటు రిజష్టర్ చేయడంతో ఈ మూవీ టైటిల్ ను రాబోతున్న కొత్త సంవత్సరం రోజున ప్రకటిస్తారని తెలుస్తోంది. ‘సైరా’ నేర్పిన పాఠాలతో ఈ మూవీ బడ్జెట్ బాగా కంట్రోల్ లో పెట్టి చిరంజీవి కొరటాలకు ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ బిజినెస్ భారీ స్థాయిలో చేసి ‘సైరా’ లో చిరంజీవికి వచ్చిన అనుకోని నష్టాలను కవర్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మణి శర్మ ట్యూన్ చేసిన పాటల ట్యూన్స్ ను చిరంజీవి ఓకె చేసిన నేపధ్యంలో ఆ పాటల రికార్డింగ్ కూడ త్వరలో జరగబోతున్నట్లు సమాచారం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: