సూపర్ట్స్టార్ మహేష్బాబు నటించిన `సరిలేరునీకెవ్వరు` ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎల్.బి.స్టేడియంలో గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదిక పై సందడి చేయడమంటే మాములు విషయం కాదు. ఫ్యాన్స్కి సందడే సందడి అని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేసింది. దర్శకుడు అనిల్రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ అనిల్శుంకర, దిల్రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్ రికార్డులు అదుర్స్ అనే చెప్పాలి.
ఇక ఈ ’ వేదిక చిరంజీవి, విజయశాంతి ఇద్దరు చేసిన సందడి తో ఆ వేదిక అంతా ఆనందంతో మునిగిపోయింది. ఈ వేదిక పై చిరంజీవి.. విజయశాంతి పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. విజయశాంతిని తన హీరోయిన్ అంటూ తనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించందని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు గెలుచుకుందని. అంతేకాదు సండే అననురా.. మండే అననురా అంటూ గ్యాంగ్ లీడర్ సినిమా పాటను చిరు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో తనను తిట్టిన సందర్భాన్ని చిరంజీవి గుర్తు చేసారు. నన్ను ఎలా తిట్టావు విజయశాంతి అని చిరు చిన్నపిల్లాడిలా తన ఆవేదన వ్యక్తం చేసారు. నేను ఎప్పుడన్నా నిన్ను ఒక్క మాటన్నా అన్నానా అని అన్నారు.
దానికి సమాధానంగా మరోవైపు విజయశాంతి మాట్లాడుతూ.. రాజకీయాలు, సినిమాలు వేరని చిరుకు గుర్తు చేసింది విజయశాంతి. ఆ తర్వాత చిరు మాట్లాడుతూ... 13 ఏళ్ల తర్వాత విజయశాంతిని చేస్తుంటే.. ఆమెలో అదే పొగరు, అదే ఫిగరు అని కాస్త సరసంగా చిరంజీవి ప్రస్తావించడం అందరినీ ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు వీళ్లిద్దరు కలిసి నటించిన పాత సినిమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మొత్తంగా స్టేజ్పై విజయశాంతిని చిరు హగ్ చేసుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్య ఆనందాలలో ముంచేసింది. ఇక చిరంజీవి రష్మిక గురించి మాట్లాడుతూ.. మందన్న నన్ను కాంట్రాక్ట్ తీసుకుంది..అని చిరు అన్నారు. తన మొదటి సినిమా నుంచి నేనే గెస్ట్ గా వెళుతున్నాను. చాలా చలాకీ అయిన అమ్మాయి. ఛలో సినిమాకి నేనే గెస్ట్. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందం గీతాఆర్ట్స్ కాబట్టి కామన్గా నేను వెళ్ళాను. తిరిగి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చాను. అంటే రష్మిక నన్ను కాంట్రాక్ట్ తీసుకున్నట్లే అని సరదాగా అన్నారు.