మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు మనుషులు రూపంలో ఉన్న మానవ మృగాలు అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. అప్పుడు వరకు మంచి వాళ్ళ లాగా ఎన్నో మాయమాటలు చెబుతున్న కామందులు.. సమయం సందర్భం చూసి ఇక తమలో దాగి ఉన్న మృగాన్ని బయటకు తీస్తున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 అయితే ఒకప్పుడు కేవలం ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై మాత్రమే ఇలా అత్యాచారాలు చేసేందుకు ధైర్యం చేసేవారు కామాంధులు. కానీ ఇప్పుడు మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు. ఏకంగా పక్కనే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారిపై దాడి చేసి మరి అత్యాచారం చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థి. ఇక కొంతమందికి అయితే ఇంట్లోనే వేధింపులు ఎదురవుతూ ఉండడంతో.. దిక్కుతోచని స్థితిలో మునిగిపోతున్నారు.


 ఇటీవల యూపీలోని లక్కింపూర్ బేరీలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమన్ అనే 22 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాను అంటూ వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఆమె మాత్రం అతని ప్రేమను ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 19వ తేదీన బంధించి మూడు రోజులపాటు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై ఇనుప రాడ్డుతో తన పేరు రాసి రాక్షసానందం పొందాడు. అయితే ఎట్టకేలకు బాధితురాలు అతని చెర నుంచి తప్పించుకుని.. ఇంటికి చేరడంతో ఇక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. కాగా అతను హైదరాబాద్ లోని ఒక సెలూన్ లో పనిచేస్తున్నట్లు తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: