అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది. అంతేకాకుండా మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. యూత్ అందరికీ అందాల దేవత గా మారిపోయింది అనుష్క శెట్టి. ముఖ్యంగా అభిమానులు ప్రేక్షకులు అందరూ అనుష్కను స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటారు అన్న విషయం. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది అని చెప్పాలి.
కానీ ఈ అమ్మడు తీసుకున్న ఒక నిర్ణయం ఈ అమ్మడు కెరీర్ నే పాడుచేసింది. యోగా టీచర్ గా ఉండి సినిమాల్లోకి రావాలని నిర్ణయంతో ఈ అమ్మడు సెలబ్రిటీగా మారిపోయి ఎంతో పాపులారిటీ సంపాదించగా... స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుని కెరియర్ మొత్తం పాడు చేసుకుంది.సైజ్ జీరో సినిమా లో ఎంతో లావెక్కింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఈ సినిమా అనుష్క కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా భారీగా లావై పోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ అమ్మడు సైజ్ జీరో సినిమా తర్వాత లావు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది ఉపయోగపడలేదు.
దీంతో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క కి అవకాశాలు తగ్గి తెర మీద ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు కాకుండా నటనకు ప్రాధాన్యం ఉండే వైవిధ్యమైన పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ దూసుకుపోతోంది. బాహుబలి సినిమా తర్వాత భాగమతి అనే ఒక సినిమాతో తెర మీదికి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది మంచి విజయాన్ని సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నది అనుష్క. ప్రస్తుతం నిశ్శబ్దం అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది.