దేశంలో ఇకప్పుడు కరోనా సినీ ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం పడిందంటే.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రూ.15 వందల కోట్ల నష్టం వాటిల్లిందని అంటున్నారు. గత వారం రోజుల నుంచి థియేటర్లు, మాల్స్ అన్నీ బంద్ అన్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్స్ తో పాటు కొన్ని చిత్రాలు సైతం క్యాన్సల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం ప్రపంచం మొత్తం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. 

 

అయితే ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందబోతుందట. టైమ్ మిషన్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అంతే కాదు రూ.50 కోట్ల గ్రాఫిక్స్ కే కేటాయిస్తారని అంటున్నారు. నాగ్ అశ్విన్ పై ఎంతో నమ్మకంతో ఈ చిత్రానికి ప్రభాస్ ఒప్పుకున్నట్లు సమాచారం. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగి ఉన్న పాన్ఇండియా హీరో అన్న విషయం తెలిసిదే... దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్దమవుతున్నారట. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్ అయింది. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు.

 

పరిస్థితి చక్కబడిన తర్వాత ప్రభాస్ ముందుగా రాధాకృష్ణ చిత్రాన్ని ప్రారంభించాలి. అది పూర్తయిన తర్వాతే నాగ్ అశ్విన్ సినిమాను పట్టాలెక్కిస్తాడు.  ఈ కారణంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చేచిత్రం మరింత ఆలస్యం అవవడం ఖాయమంటున్నారు.  వచ్చే వేసవి తర్వాతే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  ఇప్పటి వరకు ప్రభాస్ ఈ తరహా చిత్రంలో నటించలేదు.. మరి నాగ్ అశ్విన్ యంగ్ రెబల్ స్టార్ ని ఎలా చూపించబోతున్నారో ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: