సాధారణంగా బుల్లితెరపై సుధీర్ రష్మీ జంటకు ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు వెండి తెరపై ఏ హీరో హీరోయిన్ కైనా ఇంత క్రేజ్ ఉంటుందో లేదో కానీ బుల్లి తెరపై మాత్రం ఇద్దరూ కలిసి ఓ  షో లో కనిపించారు అంటే   బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడాఈ  ఇద్దరి జంట ను చూసి మురిసిపోతూ ఉంటారు.  జబర్దస్త్ లో మొదలైన వీరిద్దరి ప్రయాణం ప్రస్తుతం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ షో  లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడంతో పాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా అందుకుంటుంది. అదే సమయంలో సుదీర్ జబర్దస్త్ కమెడియన్ గా  ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు అదే సమయంలో ప్రభుత్వం సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు.



 అయితే ఈ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ పై కనిపించి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఇక ఆ షో  టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడం ఖాయం అన్న విధంగా ఉంది ఈ జంట క్రేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో. అయితే వీరిద్దరూ మాట్లాడే మాటలు కూడా ప్రస్తుతం ఎంతో మంది యువతను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఈ టీవీ యాజమాన్యం ఇటీవలే కొత్త సంవత్సరం రోజున డీజే అనే కొత్త ఈవెంట్ ను లాంఛ్ చేశారు. ఇక ఈ సరికొత్త ఈవెంట్ లో  బుల్లితెర మోస్ట్ వాంటెడ్ జోడి సుధీర్ రష్మీ తో కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేశారు.


 ఇటీవలే విడుదలైన డీజే ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ప్రోమో లో మొదట సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ఇద్దరు కలిసి మెగాస్టార్ పాట  అయిన నవ్వింది మల్లెచెండు అనే పాటకు  డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదర గొట్టారు. అయితే ఈ పర్ఫామెన్స్ సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ కూడా ఓల్డ్  గెటప్ లో కనిపించి డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడంతో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఈ పర్ఫామెన్స్ చూసి మురిసిపోతున్నారు అని చెప్పాలి.  అచ్చంగాచిరంజీవి అసలు పాట ఉన్నట్లుగానే డాన్స్ స్టెప్పులు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ జంట మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: