పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. సాగర్ చంద్ర డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవరగ నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రం డైలాగ్స్ ఉంటాయని వార్తలు రాగా.. అదే విషయాన్ని అఫీషియల్ గా చెప్పారు చిత్రయూనిట్.

ఏకే తెలుగు రీమేక్ లో త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే రెండు చేస్తున్నారట. కేవలం డైరక్షన్ మాత్రమే సాగర్ చంద్ర చేస్తున్నాడు కాని ఇక మిగతా కథ మొత్తం నడిపించేది మాత్రం త్రివిక్రం శ్రీనివాస్ అని తెలుస్తుంది. పవర్ స్టార్సినిమా చేసేలా ప్రోత్సహించింది కూడా త్రివిక్రమే అని తెలుస్తుంది. అందుకే అతనికే మొత్తం బాధ్యతలు ఇచ్చేసినట్టు ఉన్నారు. బలమైన కథకు త్రివిక్రం మాటలు రాస్తే ఇక ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.

మళయాళ వర్షన్ కథను మాత్రమే తీసుకుని దానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం కొత్తగా రాస్తున్నారట. పవన్, రానా ఇద్దరి పాత్రలు ఏమాత్రం తగ్గకుండా రాసేలా చూస్తున్నారట. అయ్యప్పనుం కోషియం రీమేక్ తప్పకుండా ఈ సినిమా తెలుగులో రికార్డులు సృష్టించేలా ఉందని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో చేస్తాడని తెలుస్తుంది. సో ఇలా చూస్తే త్రివిక్రం ఒకేసారి పవన్, ఎన్.టి.ఆర్ సినిమాలకు పనిచేస్తాడని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: