ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్సే రు. 15 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఈ సినిమాలో చాలా షాకింగ్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. పవన్ - శృతీ హాసన్ మధ్య ఫ్లాష్ బ్యాక్ లో చాలా పవర్ ఫుల్ సీన్లు ఉన్నాయట. ఇక మూడు, నాలుగు ఫైట్లు కూడా ఉన్నాయంటున్నారు. పింక్ సినిమాలో హీరోయిన్లకు ప్రత్యేక నేపథ్యం అంటూ ఏమీ ఉండదు. కానీ వకీల్సాబ్లో మాత్రం ఇబ్బందులు పడే అమ్మాయిలకు వేర్వేరు నేపథ్యాలు ఉండేలా ప్లాన్ చేశారట.
అసలు ఎందువల్ల ఆ అమ్మాయిలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారన్నది కూడా చాలా డెప్త్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇలా జరిగినప్పుడు వాళ్ల ఇంట్లో పెద్ద వాళ్లు ఎలాంటి ? మనోవేదనకు గురవుతారు ? అన్న అంశాలను దర్శకుడు వేణు శ్రీరామ్ బాగా డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లు సైతం వకీల్ సాబ్ చూసి చాలా కొత్తగా ఫీల్ అయ్యే అంశాలతో దర్శకుడు కథను కొత్తగా మార్చాడంటున్నారు.
ఏదేమైనా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంపౌండ్లో మాత్రం వకీల్సాబ్ గురించి హాట్ హాట్ డిస్కర్షన్లే నడుస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలు అందుకుంటుందో ? పవన్ను తిరిగి నిలబెడుతుందో ? చూడాలి.