ప్రపంచంలోనే అందగత్తెలలో ఒకరైన ఐశ్వర్యారాయ్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె అందం చెక్కుచెదర లేదు అంటే అతిశయోక్తి కాదు. 47 ఏళ్ళ వయసులో కూడా 30 ఏళ్ల యువతి లా కనిపిస్తున్న ఈ ప్రపంచ సుందరి ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేపథ్యంలోనే ఆమె గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే అచ్చం ఐశ్వర్యారాయ్ లాగానే కనిపించే ఒక అమ్మాయి ఇంటర్నెట్ లో దొరికింది. పాకిస్తాన్ దేశానికి చెందిన ఈ ముద్దుగుమ్మ అచ్చం ఐశ్వర్యరాయ్ లాగానే కనిపిస్తోంది. దీనితో నెటిజన్లు ఆమె ఫొటోలు వైరల్ చేస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటాయని అంటుంటారు కదా.

అలాగే పాకిస్తాన్ యువతి అయిన ఆమ్నా ఇమ్రాన్ ఐశ్వర్యారాయ్ ని పోలి ఉంది. అమెరికా దేశంలో మెడికల్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న ఈమె తన ఫోటోలను తరచూ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె అచ్చం ఐశ్వర్య లాగానే ఉందని నెటిజనులు కనిపెట్టారు. దీంతో ఆమె ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగి పోయారు. అయితే ఆమె పాకిస్థాన్ లో పుట్టి పెరిగినప్పటికీ తన అమ్మమ్మ తాతయ్య ఇండియాకి చెందిన వారేనని చెబుతున్నారు. ఇకపోతే అలియాభట్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్ లను పోలిన చాలా మంది సామాన్య ప్రజల ఫోటోలు ఇంటర్నెట్ వేదికగా సందడి చేసాయి.

ఇక ఐశ్వర్యారాయ్  కెరీర్ విషయానికి వస్తే .. ఆమె మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న "పొన్నియిన్ సెల్వన్" అనే ఓ హిస్టారికల్ డ్రామాలో నందిని అనే పాత్ర పోషిస్తున్నారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. విక్రం హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, శరత్ కుమార్, కార్తీ తదితరులు కూడా నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: