చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కలర్ ఫోటో చిత్రం... అంచనాలకు మించిన ఆదరణ పొందింది. కమెడియన్ సుహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా చేసింది.  కమెడియన్ కం హీరో సునీల్ ఈ చిత్రంలో విలన్ గా దర్శనమిచ్చాడు. సందీప్ రాజ్  ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కరోనా  నేపథ్యంలో ఆహా ఓటీటీ  వేదికపై ఈ చిత్రం రిలీజ్ అయింది. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని.. ఈ సినిమా టీం వర్క్ సూపర్ అని గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్ తో పాటు అందరికీ మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన వారందరికీ గొప్ప పేరొచ్చింది. దాంతో వీరందరికీ  మంచి ఫ్యూచర్ అందుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కలర్ ఫోటో హీరో సుహాస్ ప్రస్తుతం..షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో ''రైటర్ పద్మభూషణ్'' అనే సినిమా లో హీరోగా నటిస్తున్నారు. 'కలర్ ఫోటో' తర్వాత 'బొంబాట్' 'సూపర్ ఓవర్'  రెండు ఓటీటీ సినిమాలలో హీరోయిన్ గా కనిపించిన చాందినీ చౌదరి ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ గా మారిన సునీల్... ఓవైపు నెగిటివ్ మరో వైపు హీరో రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇకపోతే దర్శకుడు సందీప్ రాజ్ గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా కలర్ ఫోటో తో మంచి క్రెడిట్ తెచ్చుకున్న వీరందరూ ఊహించని విధంగానే ఇండస్ట్రీలో బిజీ అయినట్లు సమాచారం. అయితే సక్సెస్ రేటుతో ఏ మాత్రం సెటిల్ అవుతారనేది మును ముందు తెలియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: