పవర్ స్టార్ పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమించి తరువాత పెళ్లి చేసుకుంది. తరువాత కొన్ని కారణాల వలన పవర్ స్టార్ తో ఆమె విడిపోయింది. ఇక రేణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఈమె వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె చేసే కామెంట్లు, షేర్ చేసే ఫోటోలు, వ్యక్తపరిచే భావాలు, అభిప్రాయాలు అన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల రేణూ దేశాయ్ నిత్యం ట్రోలింగ్‌కు గురవుతుంటుంది.


పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నాక రేణూ దేశాయ్‌కి సోషల్ మీడియాలో చేదు అనుభవాలు చాలానే ఎదురవుతూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి వేరు పడ్డాక రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అప్పుడు భావించారు.అలా రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న రేణూ దేశాయ్ ని  పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఇక  ఆ సమయంలో రేణూ దేశాయ్ అభిమానులపై సీరియస్ అయ్యారు కూడా. నన్ను రెండో పెళ్లి చేసుకోవద్దని అంటున్నారు.. మరి అదే విషయాన్ని మీ హీరో పవన్ కళ్యాణ్‌కు ఎందుకు చెప్పరు అంటూ అందిరినీ సిగ్గు తీసేలా అడిగింది. అయితే రెండో పెళ్లి అంటూ ఓ అడుగు ముందుకు వేసి తనకు నిశ్చితార్థం జరిగిందనే సంకేతాలను ఇస్తూ రేణూ దేశాయ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అంటూ రేణూ దేశాయ్‌కి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి.




అలా తన రెండో పెళ్లి విషయాన్ని కాస్త వాయిదా వేశారు. కానీ తాజాగా మళ్లీ ఆ టాపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. తాజాగా రేణూ దేశాయ్ తన చేతిని, వేలికి ఉన్న ఉంగరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో కవిత్వం చెప్పేశారు. అలా ఓ పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ మళ్లీ కామెంట్లతో రెచ్చిపోయారు. రెండో పెళ్లి గురించి కామెంట్ చేశారు.అయితే అందులో ఓ నెటిజన్ మాత్రం రేణూ దేశాయ్ ఉంగరంపై కామెంట్ చేశాడు.అది పవన్ కళ్యాణ్ గారు బహుమతిగా ఇచ్చారని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు. దానిపై రేణూ దేశాయ్ కాస్త సీరియస్ అవుతూ సెటైర్ వేశారు. అందులో ఎలాంటి నిజం లేదు.. అది నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. అది నా మాజీ భర్త కొనిచ్చాడని మీరు అలా ఎలా ఊహించుకుంటారు? విడాకులు అయి ఎనిమిదేళ్లు అవుతున్నాయ్.. అలాంటి స్థితిలో ఆయన ఇచ్చిన ఉంగరాన్ని నేను ఎలా పెట్టుకుంటాను.. మీలాంటి వారంతా ఇంకాస్త ఎదగాలి.. ఇంకాస్త సున్నితత్త్వంగా మారాల్సి ఉంది అంటూ కోపంతో రెచ్చిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: