టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్‌గా కెరీర్‌ను తమిళ్‌లో ప్రారంభించిన పూజా తరువాత తెలుగు మీద ఫోకస్ పెట్టింది. మిశ్కిన్ తెరకెక్కించిన ముగమూడి అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇందులో జీవా సరసన పూజా నటించగా.. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పూజ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 



మొదట్లో ఇక్కడ కూడా ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ డీజే సినిమా మొదలు విజయాలు రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ముకుంద సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత రాను రాను తనలోని హాట్ యాంగిల్స్ అన్నీ చూపిస్తూ ఫొటోలు రిలీజ్ చేస్తోంది. నిజానికి తాజాగా పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత ఆమె కోలుకున్నానని కూడా ప్రకటించింది. 


అయితే అసలు విషయానికి వస్తే ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు రచ్చ రేపుతోంది. బేర్ బ్యాక్ తో ఉన్న ఫోటోను తాజాగా పూజా హెగ్డే షేర్ చేసింది. ఈ ఫోటోకి నేటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మొన్నీ మధ్యే దళపతి విజయ్ 65వ చిత్రంలో హీరోయిన్‌గా కూడా ఎంపికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: