రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పూరిజగన్నాధ్ బద్రి సినిమాతో  డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమానే భారీ విజయాన్ని అందుకున్నాడు. బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ ను పూరిజగన్నాధ్ కొత్తగా చూపించాడు. ఆ సినిమాకు పవర్ ఫుల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు. బద్రి సినిమా తరువాత తన స్నేహితుడు అయిన రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తీసాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత  రవితేజ కాంబినేషనులో రెండవ  సినిమా చేసాడు. ఆ సినిమానే ఇడియట్.ఆ సినిమా భారు విజయం అందుకుంది. ఈ సినిమాతో రవితేజా స్టార్ హీరోగా మారాడు. ఆ సినిమా రవితేజ కెరీర్ లో గుర్తుండిపోయింది. ఆ సినిమా తరువాత రవితేజ  పూరిజగన్నాధ్ సినిమాలో మరొక సినిమా తెరకెక్కింది. ఆ సినిమానే అమ్మ నాన్నతమిళ్ అమ్మాయి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలతో రవితేజ, పూరిజగన్నాధ్ హిట్ పెయిర్ గా నిలిచారు.

రవితేజతోనే కాకుండా ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో కూడా పూరీ సినిమాలు తీసాడు. సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించి మాస్ హీరోగా భారీ క్రేజ్ సంపాదించాడు. ఆ సినిమా ఎన్టీఆర్ పూరిజగన్నాధ్ కాంబినేషనులో ఆంధ్రవాలా సినిమా తీసాడు. కానీ ఆ సినిమా విజయాన్ని అందుకోలేదు. కొన్ని సినిమాలు చేసిన విజయాన్ని అందుకోలేడు. ఆ తరువాత 2006 లో మహేష్ హీరోగా పూరీ తీసిన సినిమా పోకిరి. ఈ సినిమాకు పూరిజగన్నాధ్ నిర్మాతగా కూడా వ్యవహారించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అప్పటి వరకు ఉన్న సింహాద్రి రికార్డ్స్ అన్ని బ్రేక్ చెసింది.

ఆ తరువాత పూరిజగన్నాధ్ 2007 లో అల్లుఅర్జున్ తో దేశముదురు సినిమా చేసాడు. ఈ  సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఆ తరువాత  తీసిన  చాలా సినిమాలలో కొన్ని విజయం సాధించిన పోకిరి స్థాయి హిట్ లభించలేదు. ఆ తరువాత మహేష్ హీరోగా పూరిజగన్నాధ్ బిజినెస్ మాన్ సినిమా తీసాడు. వీరిద్దరి కాంబినేషనులో వచ్చిన రెండవ సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధించిన ఊకిరి అంత విజయం రాలేదు.ఆ తరువాత ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసాడు. కానీ ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించాడు. పూరీ మాస్ డైలాగ్స్ రాసాడు. ఈ సినిమా పూరీ, ఎన్టీఆర్ కెరీర్ మార్చేసింది అంత భారీ  విజయం సాధించింది.ఈ  సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపాడు. ఈ  సినిమా తరువాత నితిన్ హీరోగా హార్ట్ ఎటాక్ సినిమా తీసాడు. ఈ సినిమా ఒక మోస్తరు విజయం సాధించింది.ఇదిలా ఉండగా పూరిజగన్నాధ్ కు మహేష్  ఒక సలహా ఇచ్చాడు.హార్ట్ ఎటాక్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయమని చెప్పాడు. అందులో రన్ బీర్ కపూర్ ను తీసుకోమని మహేష్ చెప్పడం జరిగింది. పూరీజగన్నాధ్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: