టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన
త్రిష ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం ఆమె అభిమానులను ఎంతగానో కృషి చేస్తుంది. మెగాస్టార్
చిరంజీవి సరసన ఆమె
సినిమా అవకాశాన్ని సంపాదించింది అని చెబుతున్నారు. బాలకృష్ణతో కూడా
సినిమా చేయడానికి ఆమె ఓకే చెప్పపోతుందని అంటున్నారు. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్
సినిమా కు కూడా ఆమెను సంప్రదించారట.
ఇది కూడా ఆమె ఓకే చెబుతుందని చెబుతున్నారు. ఇలా
టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ వరుస
సినిమా అవకాశాలు కొట్టేస్తుండడం గమనార్హం. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈమె ఓ పెద్ద దర్శకుడిని పెళ్లిచేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. 38 ఏళ్ల
త్రిష తరచూ
పెళ్లి విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉండడంతో ఇప్పుడు ఈమె గురించి అంతా చర్చ నడుస్తుంది.
హీరో శింబుతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన ఈమె అతన్ని
పెళ్లి చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి.
రాణా
త్రిష రిలేషన్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. వీరు డేటింగ్ చేశారన్న వార్తలు ఒకసారి రావడంతో , ప్రైవేట్ ఫోటోలు కూడా ఇంటర్నెట్లో లీక్ అవ్వడంతో ఈ తరహా గాసిప్ లకు కారణం అయింది.
రానా పెళ్లి పకటన తర్వాత సోషల్ మీడియాలో
త్రిష పెట్టిన పోస్ట్ లు కూడా అనేక అనుమానాలకు దారి తీసినవి.
త్రిష 2015లో చెన్నైకి చెందిన
వరుణ్ మణియన్ అనే బిజినెస్ మాన్ తో నిశ్చితార్థం చేసుకోగా కారణం తెలియదు కాని వీరు తమ
పెళ్లి నీ రద్దు చేసుకున్నారు. కాగా తాజాగా ఓ ఫిలిం
డైరెక్టర్ వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ నిరాధార ఆరోపణలు అని తేల్చి చెప్పింది. దీంతో
త్రిష పెళ్లి వార్తలు మరొకసారి పుకారు గా మిగిలిపోయాయి.