టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'లై' సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ మేఘ ఆకాష్. ఆ సినిమా అట్టర్ ప్లాపైనా కూడా మళ్ళీ నితిన్ తోనే 'ఛల్ మోహన్ రంగా' సినిమా చేసింది.ఇక అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డది.ఇక ఆ రెండు కళాఖండాలు కూడా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ గానే మిగిలాయి. దాంతో తెలుగు లో ఈ హాట్ బ్యూటీ బాగా హాట్ గానే వున్నా కాని ఎందుకులే అనే పెద్ద హీరోలు ఈ ముద్దుగుమ్మని లైట్ తీసుకున్నారు. అయితే అనుకోకుండా ఈమెకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా పేటా లో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ తో తమిళ ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ కు ఇక అక్కడ బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అక్కడి స్టార్ హీరోలు కూడా ఈ హాట్ బ్యూటీకి ఇంప్రెస్ అయ్యి ఈమెతో నటించేందుకు సిద్దంగా ఉన్నారు.అక్కడ పెద్ద సినిమాలలోనే ఈమె అవకాశాలు అందుకుంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే..తాజాగా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య మూడు మిలియన్ లకు చేరడం జరిగింది. ఇక మేఘ ఇన్ స్టా గ్రామ్ లో మూడు మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సందర్బంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఇంస్టాలో పోస్ట్ షేర్ చేసింది.అది కూడా కొంచెం ఓవర్ గా బీచ్ లో లవ్ సింబల్ వేసి అందులో పూలతో మరీ బాగా అలంకరించి మూడు మిలియన్ లు అని రాసి ఇన్ స్టా సింబల్ ను వేసి మరి చెప్పింది. మూడు మిలియన్ ల మంది ఫాలోవర్స్ దక్కినందుకు ఈ అమ్మడు సంతోషంతో ఫ్రెండ్స్ కి పెద్ద పార్టీ ఇచ్చి మరీ సెలెబ్రేషన్ చేసుకుంది.ఇక ఈ విషయం పై నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. దీనికే ఇంత ఓవర్ చెయ్యడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.ఇక ఈమధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని తెగ సిన్సియర్ గా తీసుకుంటున్నారు సెలెబ్రెటీలు. ఫాలోవర్స్ ఆధారంగానే తమ స్టార్ డమ్ నిర్థారిస్తున్నారు. అందుకే ఈ హాట్ బ్యూటీ మేఘా ఆకాష్ కూడా మూడు మిలియన్ ఫాలోవర్స్ తో క్రేజీ హీరోయిన్ గా మరింతగా జనాలకు చేరువ అవుతోందని ఫీలై పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: