వరుస పరాజయాలతో సతమతమవుతున్న భూమి కోసం ఎదురుచూస్తున్నా అఖిల్ తన నాలుగవ సినిమాతో హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం ఆ దిశగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవలే విడుదల అయిన లెహరాయి పాటలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలను కూ డా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన కూడా సరైన సమయం కోసం వేచి చూడగా అక్టోబర్ 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ నేపథ్యం లోనే ఆ రోజు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో సినిమా కోండపోలం కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావించగా అఖిల్ కోసం ఈ తేదీని వైష్ణవ్ మార్చుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. 

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక హీరో మరొక హీరో లు పరస్పరం హెల్ప్ చేసుకోవడం కొత్తేమీ కాదు. ఒక హీరో ఇబ్బందుల్లో ఉంటే మరొక హీరో ఆ హీ రో ని ఇబ్బంది నుంచి బయటకు లాగడానికి ఆ సినిమా కార్యక్రమాని కి వెళ్లడం లేదా ఆ సినిమాకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ వైష్ణవ్ మాత్రం అఖిల్ కోసం ఏకంగా తన సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ చేయడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన కొండపొలం సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించగా మరి ఈ చిత్ర విడుదల మళ్లీ ఎప్పుడు ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: