తనతో పాటు భర్త కూడ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. తాజాగా శ్రియ అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టి అందరినీ షాక్కి గురి చేసింది. ఇంతకు ఆ రహస్యం ఏమిటి అంటే.. తాజాగా శ్రియ పండంటి బిడ్డకు జన్మను ఇచ్చింది. ఆమె రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీకోషిన్ను వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2020 కరోనా ప్రారంభ సమయంలో విధించిన లాక్డౌన్ అప్పుడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.
తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది శ్రియ. 2020లో ప్రపంచం మొత్తాన్ని కరోనా చాలా ఇబ్బందులలో పెట్టింది. ఆ సంవత్సరం మొత్తం అందరూ క్వారంటైన్లోనే ఉన్నారు. దాని వల్ల చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. కానీ మా జీవితంలో మాత్రం ఒక అద్భుతం జరిగింది. మాకు చిన్నారి రాకతో ఈ ప్రపంచం మారిపోయింది. ఏంజిల్ను ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎంతో రుణపడి ఉంటానని.. శ్రియ ఈ శుభవార్తను షేర్ చేసి తన అభిమానులతో పంచుకున్నది. ఈ వార్త విన్న అభిమానులు పలువురు ఇన్ని రోజులు ఎందుకు సస్పెన్స్గా ఉంచారని అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. కూతురు పెద్దగా అయ్యాక అందరికీ పరిచయం చేయాలనే రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తానికి శ్రియ జీవితంలో ఒక శుభవార్త. ఈ విషయాన్ని శ్రియతో పాటు తన భర్త ఆండ్రీకోషిన్ కూడా పంచుకోవడం విశేషం.