తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో రోజుల నుంచి అలరిస్తూ ఇక ఇప్పుడు మరో సారి ఎంటర్ టైన్మెంట్ పంచుతుంది బిగ్బాస్ కార్యక్రమం. ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రసారం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్బాస్  కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. దీంతో ఇక గేమ్ కాస్త రసవత్తరం గా మారిపోయింది.. 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్బాస్ కార్యక్రమంలో ప్రస్తుతం కేవలం ఆరు మంది మాత్రమే ఉన్నారు. ఇక వీరిలో టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది.



 ఇక బిగ్ బాస్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇదిగో ఎలిమినేట్ అదిగో ఎలిమినేట్ అయింది అంటూ పింకీ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన పింకీ తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించి ప్రతివారం సేవ్ అవుతూ వచ్చింది.కానీ ఇటీవలే పింకీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే గతవారమే పింకీ ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పింకీ కి బదులు రవి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో అందరి అనుభవాలను పంచుకుంటూ ఉంటారు.



 ఈ క్రమంలోనే అటు పింకీ కూడా బిగ్ బాస్ అనే కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చింది ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా మొత్తం మానస్ గురించే మాట్లాడింది పింకీ. అయితే ఈ సందర్భంగా మానస్ నీ గురించి కాజల్తో ఏం చెప్పాడో వీడియో ఉంది చూస్తావా అంటూ అడగ్గా.. చూస్తాను అంటూ చెప్పింది పింకి. ఈ క్రమంలోనే పింకీ గురించి మానస్ కాజల్ ఊహించని విధంగా మాట్లాడుకోవడం చూసి ఒక్క సారిగా షాక్ అయింది. మానస్ ను నా పిల్లాడిలా చూశాను కానీ మానస్ ఇలా మాట్లాడతావని అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పింకీ.

మరింత సమాచారం తెలుసుకోండి: