మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ జోష్ ని అలాగే కంటిన్యూ చేసే ఉద్దేశంతో రవితేజ వరుస క్రేజీ సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు.  ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  

ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.  ఇదిలా ఉంటే ఈ సినిమా తో పాటు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ  పవర్ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు, శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత, ఈ సినిమాను మార్చి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది, కానీ తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విషయంలో మనసు మార్చుకుంది, ఈ సినిమాను మార్చి 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని, ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సినిమా దర్శకుడు శరత్ మండవ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే భవిష్యత్ అంతా కూడా వైరస్ ఫ్రీ గా ఉండాలి అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలా రవి తేజ తన సినిమా విడుదలను వాయిదా వేసి ఆయన అభిమానులను నిరాశకు గురి చేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాలో నటించబోతున్నాడు, అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో నటించడానికి కూడా ఇప్పటికే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: