కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గత కొంతకాలంగా  వరుస హిట్లతో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.ఇక తాజాగా ఆయన 'వలిమై' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. అజిత్ సరసన హీరోయిన్ గా హుమా ఖురేషి కనిపించనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు తమిళ  ఇంకా హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటికి కరోనా మహమ్మారి తీవ్రత అనేది బాగా పెరుగుతూ ఉండటం వలన అలాగే చాలా ప్రాంతాల్లో కూడా థియేటర్లు మూసుకుంటూ వస్తుండటం వలన ఈ సినిమాను విడుదల చేయలేక మేకర్స్ వాయిదా వేసుకున్నారు. ఇక ఫిబ్రవరి నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి ఈ సినిమా మేకర్స్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక దాదాపు సినిమా డేట్ ఖాయమైనట్టేనని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో దోపిడీలకు పాల్పడుతున్న విలన్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి నియమించబడిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్ కుమార్ కనిపించనున్నారు.ఈమధ్య ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయగా డానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లోని ఛేజింగ్ సీన్స్  లాగా యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా కందిరీగల్లా దూసుకుపోయే బైక్స్ ..ఇంకా హీరో ఛేజింగ్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా అనిపిస్తోంది. ఇక ఈ షూటింగులో బైక్ పై నుంచి పడిపోయి అజిత్ కుమార్ గాయపడిన సంగతి తెలిసిందే.ఇక తెలుగులో హీరోగా స్టార్ డమ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న యంగ్ హీరో కార్తికేయ. ఇక ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.

ఈ పాత్ర ద్వారా కార్తికేయ పర్సనాలిటీని పర్ఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పాత్ర తనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెడుతుందని కార్తికేయ భావిస్తున్నాడు. విలన్ గా కార్తికేయ అక్కడ బిజీ కావడం ఖాయమని ఇక్కడి ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి చూడాలి హీరోగా రాని బ్రేక్ కార్తికేయకు విలన్ గా వస్తుందో రాదో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: