ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సాధారణంగా ఒకే కథాంశంతో వున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం.. ఇక ఈ క్రమంలోనే ఒక లైన్ ఆధారంగా తీసుకొని వివిధ రకాల సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు వాటిని పరిచయం చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఓకే పాయింట్ తీసుకొని నాని , నాగశౌర్య ఇద్దరూ ఒకే కథలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కరోనా రాకముందు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా కృష్ణ బృందా విహారీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు అధికారికంగా ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఈ సినిమా కూడా ఆలస్యం అవుతూ రావడంతో వాయిదా వేయడం జరిగింది.

ఇక ఈ సినిమాలు నాగ శౌర్య బ్రాహ్మణ కుర్రాడిగా మనకు కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా అంటే సుందరానికి అనే సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నేచరల్ స్టార్ నాని బ్రాహ్మణ కుర్రాడిగా సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ రెండు సినిమాలలో ఈ ఇద్దరు హీరోలు కూడా బ్రాహ్మణ కుర్రాళ్ళు గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకే విధంగా ఉంటున్నట్లు సమాచారం.

మరి బ్రాహ్మణ  హీరోలగా ఎవరికి కలిసి వస్తుందో తెలియాలి అంటే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే వరకూ ఎదురుచూడక తప్పదు. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఎలాంటి విజయాలను అందుకుంటారో కూడా మనకు తెలియాల్సి ఉంది.. ఇప్పటికీ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: