ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, మద్రాస్ అంటూ ఇలా రకరకాల ప్రదేశాలలో సినిమా ప్రమోషన్స్ చేపట్టి ప్రేక్షకుల్లో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడం గమనార్హం. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమా కోసం ముఖ్యంగా ఆలియాభట్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి తెలుగులో నటించబోతుందన్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకని మరి నటిస్తుండడంతో ఈమె పాత్ర పై ప్రతి ఒక్కరి అంచనాలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి అందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో బుక్ మై షో ద్వారా టికెట్లు బుకింగ్ మొదలవగా మిగతా రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఎప్పుడు మొదలు పెడతారు అని ఆత్రుతగా ఎదురు చూశారు. ఇకపోతే ఈ రోజు నుంచి తమిళనాడు అలాగే ముంబై వంటి మహానగరాలలో ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక ఈ సినిమా టికెట్స్ బుకింగ్ చూస్తూ ఉంటే కేవలం మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశాలున్నట్లు చిత్రం యూనిట్ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా కలెక్షన్ల పరంగా తొలి ఇండియన్ ఫిలిం గా రికార్డు సృష్టించబోతోంది ఈ సినిమా అంటూ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి