ఇక "ఆర్ ఆర్ ఆర్" దర్శక హీరోలు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇంకా దుబాయ్ తో పాటు దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తూ సినిమాని ప్రమోట్ చేశారు. అయితే సినిమా కథా రచయిత  కేవీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.సాధారణంగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తాను కథలు అందించిన సినిమాల ప్రమోషన్లలో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటారు. కానీ స్వయానా దర్శకాధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్.. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రమోషన్లతో పాటు ఇతర ఈవెంట్స్ లో కూడా కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.దీనికి తోడు రాజమౌళి ఎక్కడా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా కథ రాసిన తన తండ్రి పేరుని ప్రస్తావించలేదు.ఇక ఇంటర్వ్యూలలో ఇంకా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి పేరు పేరునా చెప్పిన జక్కన్న.. గొప్ప రచయిత అయిన తన తండ్రి ఎందుకు ప్రస్తావించలేదనేది పలు ఊహాగానాలు పుట్టుకొచేలా చేసింది. 


విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథతో రాజమౌళి సంతృప్తి చెందలేదా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.ఇక 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రమోషన్లలో విజయేంద్రప్రసాద్ లేకపోవడంతో అభిమానులు కూడా బాగా ఫీల్ అయ్యారట.వయసు సంబంధిత సమస్యల వలన కోవిడ్ పాండమిక్ సమయంలో రిస్క్ చేయడం ఎందుకని బాహుబలి రైటర్ ఈ ప్రమోషన్లకు దూరంగా వుంటున్నారనే వార్తలు వచ్చాయి. అలానే యస్ యస్ రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సినిమా కోసం స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారని కూడా అన్నారు.ఇక ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ తాజాగా పలు న్యూస్ చానల్స్ లో ప్రత్యక్షమవ్వడం జరిగింది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విశేషాలతో పాటుగా ఇంకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: