రానా దగ్గుబాటి ఇంకా సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరాటపర్వం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి.అయితే టాక్ కు తగినట్టుగా ఈ సినిమాకు బుకింగ్స్ లేకపోవడం అనేది గమనార్హం. ఈతరం యువతకు నక్సలిజం గురించి అవగాహన లేకపోవడం అనేది ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు. అయితే విరాటపర్వం సినిమాను బ్యాన్ చేయాలంటూ తాజాగా ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు అనేది అందింది.విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి  అయిన అజయ్ రాజ్ విరాటపర్వం మూవీ గురించి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ సినిమా ఉందని మూవీలోని కొన్ని సీన్లు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆ ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అందుకే ఈ సినిమా ప్రదర్శనను ఆపివేయాలని కె.అజయ్ రాజ్ కోరారని సమాచారం. మరి ఈ ఫిర్యాదు గురించి చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


ఇంకా అలాగే సెన్సార్ బోర్డ్ అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఫిర్యాదు నమోదైందని విరాటపర్వం సినిమాకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ఫిర్యాదు అందిందని సమాచారం. ఈ విరాటపర్వం మూవీ నక్సలిజంను ప్రేరేపించేలా ఉందని ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని ఫిర్యాదుదారుడు ప్రశ్నించినట్టు సమాచారం తెలుస్తోంది.మరి పోలీసులు ఈ ఫిర్యాదు విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఇంకా అలాగే సాయిపల్లవి కొన్నిరోజుల క్రితం చేసిన కామెంట్ల వల్ల ఈ సినిమాకు కొంతమేర నష్టం జరిగిందనే సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో అనేది ఇంకా చూడాల్సి ఉంది. ఇక ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: