అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఫిదా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది . 

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సాయి పల్లవి ఇప్పటి వరకూ తన కెరియర్ లో గ్లామర్ పాత్రలకు , స్కిన్ షో కు అవకాశం ఉన్న పాత్రలకు చాలా దూరంగా ఉంటూ అలాగే కమర్షియల్ సినిమా లలో కూడా నటించకుండా కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న డీసెంట్ క్యారెక్టర్ లలో మాత్రం ఎంచుకొని అందులోనే నటిస్తూ వస్తోంది . అందులో భాగంగా తాజాగా కూడా సాయి పల్లవి 'విరాట పర్వం' అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది . ఈ సినిమాలో సాయి పల్లవి ... వెన్నెల అనే పాత్రలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సాయి పల్లవి 'గార్గి' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది .

సినిమా ఈ రోజు అనగా జూలై 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది . అందులో భాగంగా తాజా ఇంటర్వ్యూ లో సాయి పల్లవి మాట్లాడుతూ ... తన కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన పాత్రలు అన్నీ కూడా తనకు చాలా సంతృప్తిని ఇచ్చాయి అని , అయితే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ బిల్ మూవీ లాంటిది చేయాలనేది తన డ్రీమ్ అని సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: