టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు ఏడాది కావస్తుంది. ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ వీరిద్దరికీ సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న అనంతరం పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకుని మూడు నాలుగు ఏళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరు ఊహించిన విధంగా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. 

అయితే గతంలో వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తామని మాట ఇచ్చారట. ఇక ఆమె ఎవరో కాదు నందిని రెడ్డి. సమంతా పెళ్లయిన తర్వాత బేబీ సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాతో మంచి హిట్ను ఇచ్చింది .ఇక నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నాగచైతన్య మరియు సమంత కలిసి ఒక సినిమాలో నటిస్తామని నందిని రెడ్డికి మాట ఇచ్చారట. అంతేకాదు అప్పుడే అగ్రిమెంట్ కూడా చేసిందట సమంత.

కానీ అనుకోకుండా ఎవరూ ఊహించిన విధంగా ఆ సమయంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య అగ్రిమెంట్ను లీగల్గా క్యాన్సల్ చేయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చేసేదేమీ లేక నందిని రెడ్డి కూడా నాగచైతన్య మాటని కాదనలేక ఆ అగ్రిమెంటును క్యాన్సల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత కూడా ఈ అగ్రిమెంట్ ని లీగల్ గా క్యాన్సర్ చేయాలని భావిస్తుంది. కానీ నందిని రెడ్డి సుమంత క్లోజ్ ఫ్రెండ్ కావడంతో తనకి ఏమి చెప్పలేకపోయింది. దీంతో నాగచైతన్య అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడంతో సమంత సేఫ్ అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: