టాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎవరు ఏమనుకున్నా కానీ తనకు మనసులో అనిపించినది ముఖం మీద చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తర్వాత అలా ధైర్యంగా మాట్లాడే వ్యక్తులలో రెండో పేరు డైరెక్టర్ తేజ పేరే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. తేజ కి తేజ మాటలకి అతని యాటిట్యూడ్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ తేజ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అహింస.

అభిరామ్ దగ్గుపాటి సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందటా.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేశారుటా.అహింస సినిమా.. జయం సినిమాకు దగ్గర పోలికలు ఉన్నట్లుగా  అయితే అనిపిస్తుంది అని మ్యూజిక్ గానీ, కథలు ట్రావెలింగ్ గానీ ఓ సెపరేట్ ఫ్లో ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన దర్శకుడు తేజ.. నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్ అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ కూడా కలుస్తుంటాయి. ఎందుకంటే ఆ సినిమాని రాసింది, తీసింది మొత్తం నేనే కదా అని తెలిపారు తేజ. నేను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ సినిమాలైనా కూడా ఒకేలా ఉంటాయి. అలాగే రాజమౌళి సినిమాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి అని తెలిపారు. రాజమౌళి సినిమాలు అన్నీ మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకే తరహాలో అయితే ఉంటాయి. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్, గౌతమ్ మీనన్ సినిమాలు కూడా అన్నీ అలాగే ఉంటాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారటా తేజ. అభిరామ్ దగ్గుపాటి హీరోగా నటించిన అహింస సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: