రానా హీరోగా తేజ  దర్శకత్వం లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.తేజ దాదాపు దశాబ్ద కాలం తర్వాత సక్సెస్ ను అందుకోవడంతో ఇక పై మళ్లీ ఆయన జోరు కంటిన్యూ చేస్తాడని అంతా కూడా భావించారు. కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత మళ్లీ తేజ పరిస్థితి మళ్ళీ అలాగే అన్నట్లు తెలుస్తుంది.. తాజాగా ఆయన రానా తమ్ముడు అభిరామ్ తో అహింస అనే సినిమా ను రూపొందించిన సంగతి తెల్సిందే. ఆ సినిమా తీవ్రంగా అయితే నిరాశ పర్చింది. ఇలాంటి సినిమాలను ఇంకా ఎవరు చూస్తారు అంటూ తేజ పై ట్రోల్స్ చేయడం కూడా మొదలు పెట్టారు. అయినా సురేష్ బాబు గారు ఈ సినిమా కథ కు ఎలా ఓకే చెప్పారు అని కూడా కొందరు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది.

దగ్గుబాటి ఫ్యామిలీకి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదేమో అందుకే అహింస సినిమా ను చేస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదేమో అంటూ ఇష్టానుసారంగా అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రానా తో తేజ సినిమా గురించి కూడా కొంత చర్చ జరుగుతోంది. అహింస సినిమా ప్రమోషన్ సమయంలోనే రానా తో సినిమా ఉంటుంది అంటూ ప్రకటన కూడా వచ్చింది. రానా మరియు తేజ కాంబోలో రాక్షస రాజు రావణాసుర అనే టైటిల్ తో సినిమా రాబోతుంది అంటూ ప్రకటన కూడా వచ్చింది. కానీ తాజాగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు తేజ కథ మరియు స్క్రిప్ట్ విషయంలో రానా మరియు సురేష్ బాబు ఇతర దగ్గుబాటి కాంపౌండ్ కు చెందిన రచయితలను సంతృప్తి పరిస్తేనే సినిమా సెట్స్ పైకి వెళ్ళేది.కనుక ఇప్పట్లో రాక్షస రాజు రావణాసుర సినిమా తెరకేక్కడం అనుమానమే అన్నట్లుగా అయితే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తేజ కొత్త సినిమా చేయాలంటే కాస్త సమయం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: