చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి మూవీ అద్భుతమైన విజయాన్ని తెలుగు , తమిళ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రజిని సరసన నయన తార హీరోయిన్ గా నటించగా ... ప్రభు , జ్యోతికమూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇక ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించి భారీ కలక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు పి వాసు , రాఘవ లారెన్స్ హీరోగా కంగనా రనౌత్ కీలక పాత్రలో చంద్రముఖి 2 అనే మూవీ ని రూపొందించాడు.

ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినటువంటి చంద్రముఖి మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో చంద్రముఖి 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు భారీ మొత్తంలో కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ కి ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కుతాయో చూడాలి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత "ఓ టి టి" లోకి ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమా జెమినీ టీవీ లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: