మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా హీరోల లాగా రొటీన్ కథలను కాకుండా డిఫరెంట్ జానెర్స్ లో సినిమాలు తీస్తూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. ఈ మధ్యకాలంలో కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఆయన ప్లాన్స్ వర్కౌట్ అవడం లేదు.. అలా అని నిరాశ చెందకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండే కథలని ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా 'గాండీవ దారి అర్జున' సినిమాతో డిజాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

తాజాగా ఈ సినిమాకి భారీ డీల్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ప్లాపుల్లో కూరుకుపోయిన వరుణ్ తేజ్ భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో రాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి భారీ బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ డీల్ గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే ప్లాపులతో హీరోగా వరుణ్ తేజ్ మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉన్నా కూడా తన కొత్త సినిమాకి భారీగా బిజినెస్ జరగడం గమనార్హం. కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఓ పైలట్ గా కనిపించబోతున్నాడు. 

ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ వార్ మూవీ ఇది అని చిత్ర టీం మొదటి నుంచి ప్రచారం చేస్తోంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగులోనే కాకుండా ఇండియాలో తక్కువ సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి నాన్ థియెట్రికల్ డీల్ భారీగా జరిగినట్లు సమాచారం. 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ.50 కోట్లకు పైగా డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులోనే ఓటీటీ, శాటిలైట్ తో పాటు ఆడియో రైట్స్ కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: