బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'కర్ణ'. మహా భారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తున్నారు.తమిళ స్టార్ హీరో సూర్య ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయి.తాజాగా ‘కర్ణ’ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో సూర్య సరసన టాలీవుడ్ దివంగత హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఆమెను కాంటాక్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మక మూవీలో అవకాశం రావడంతో ఆమె కూడా సరే అన్నట్లు ఇండస్ట్రీలో సమాచారం వినిపిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


పాన్ ఇండియా మూవీగా ‘కర్ణ’ సినిమా రూపు దిద్దుకోబోతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ సింగర్ ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే మొదట ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చేయాలని దర్శకుడు రాకేష్ భావించినా, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్యసినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రెండు బాగాలుగా తెరకెక్కుతుంది.సూర్య రీసెంట్ గా ‘కంగువ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమాకు తెలుగు తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి దాకా నిర్మించిన తమిళ చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీ తమిళ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇక సుధా కొంగరతో కూడా ఓ సినిమాను చేయబోతున్నారు సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: