టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. తాజాగా రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఒక సెన్సేషనల్ సినిమా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి, త్రివిక్రమ్ కథ వినిపించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వచ్చే వారంలోని వీరిద్దరి మధ్య స్టోరీ సిట్టింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కథ విన్న తర్వాత రామ్ చరణ్ ఒకే చెప్పేస్తే.. వెంటనే షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాకి పోటీ ఇస్తుంది.
 
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో షూటింగ్ లో బీజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. పెద్ది సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొన్న ఈ మధ్యే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

 
ఇదిలా ఉండగా.. హీరో రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవలే ప్రతిష్టించారు. ఇకపోతే రామ్ చరణ్ మొదటి చిరుత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మగధీర సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు, ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ , రచ్చ, చిరుత, నాయక్, దృవ వంటి సినిమాలలో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: