
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "కుబేర" సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా పాజిటివ్ ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ధనుష్ పర్ఫామెన్స్ కి వేరే లెవెల్ కామెంట్స్ పెడుతున్నారు . ధనుష్ తప్పితే ఈ పాత్రలో మరి ఏ హీరోయిన్ కూడా సూట్ అవ్వరు అంటూ చాలా ఓపెన్ గానే స్పందిస్తున్నారు . అయితే ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో నటించగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రష్మిక "సమీరా" పాత్రకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది .
అనిమల్ సినిమాలో గీతాంజలి పాత్ర ..తర్వాత పుష్ప2 సినిమాలో శ్రీవల్లి పాత్ర కి అలాంటి కామెంత్స్ దక్కించుకున్న రష్మిక ఇప్పుడు కుబేర సినిమాలో సమీరా పాత్రకి కూడా అలాంటి కామెంట్స్ దక్కించుకుంటుంది . దీని పట్ల రష్మిక కూడా పాజిటివ్గా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. అయితే ఈ సినిమాలో రష్మిక నటించిన సమీరా పాత్రకు ముందుగా హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకున్నారట శేఖర్ కమ్ముల. అయితే ఆమె తన పెళ్లి అలాగే బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన కాల్ షీట్స్ కారణంగా ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిందట. ఆమె చేసిన బాలీవుడ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒకవేళ ఆమె ఆ సినిమా బదులు ఈ సినిమా ఒప్పుకొని ఉన్న కెరియర్ సెటిల్ అయిపోయి ఉండేది అంటున్నారు జనాలు. అంతేకాదు కీర్తు సురేష్ బేబీ జాన్ కోసం మంచి మంచి సినిమాలను మిస్ చేసుకుంది అంటూ ఓ న్యూస్ అప్పట్లో తెగ చక్కర్లు కొట్టింది. కీర్తి సురేష్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది అంటూ బాధ పడిపోతున్నారు ఫ్యాన్స్ . నిజమే రష్మిక పాత్రలో కీర్తి సురేష్ కూడా బాగా నటించి ఉండేది అంటున్నారు జనాలు..!