నటసింహం నందమూరి బాలకృష్ణ పుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను శాసిస్తూ, ఎలాంటి కథనమైనా తన మాస్ ఇమేజ్‌తో హిట్ చేయగల శక్తి ఒక్క బాలయ్యకే ఉందని మరోసారి నిరూపిస్తున్నారు. బోయపాటితో చేసిన అఖండ ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అదే జోష్‌లో ఇప్పుడు అఖండ 2 సెట్స్ మీద దూసుకెళ్తోంది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్‌లో అలరించబోతున్నాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి సినిమాలో బాలయ్య డబుల్ యాక్షన్ అంటే ఫ్యాన్స్‌కే కాదు, మొత్తం సినీ పరిశ్రమకే ఒక సెలబ్రేషన్ అని చెప్పాలి. ఇదే ఉత్సాహంలో బాలయ్య మరో భారీ ప్రాజెక్ట్ లాక్ చేశారు. ఈసారి యాక్షన్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సింహం 111వ మూవీ రాబోతుంది. ఇప్పటికే కథ ఫైనల్ అయిపోయిందని టాక్.

 ఇది సాధారణ యాక్షన్ కథ కాదు, కొత్త కాన్సెప్ట్‌తో కూడిన సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ స్పెషల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ పీక్స్‌లోనే కథ నడిపేలా డిజైన్ చేశారట. బాలయ్య అభిమానులను మరింత ఉత్సాహపరిచే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయంలోనే కనబడబోతున్నారని టాక్. అంటే అఖండ 2లో డబుల్ యాక్షన్ ఎంజాయ్ చేయబోతున్న నందమూరి ఫ్యాన్స్, గోపీచంద్ సినిమాలో కూడా అదే మాస్ ట్రిప్‌ను ఆస్వాదించనున్నారు. ఇటీవలే గోపీచంద్ సోషల్ మీడియాలో "గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్" అని ఇచ్చిన హింట్‌కి ఇప్పుడు మరింత బలం చేకూరింది.

ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనుండగా,  ఇప్పటికే "ఈసారి బాలయ్య గర్జన మరింత ఘాటుగా ఉంటుంది… థియేటర్లు దద్దరిల్లిపోతాయి" అని ఫ్యాన్స్‌కి హైప్ ఇచ్చేశాడు. దీంతో బాలయ్య అభిమానులు డబుల్ కిక్‌లో మునిగిపోయారు. అఖండ 2 విజయంతో బాలయ్య రేంజ్ మరింత ఆకాశాన్నంటనుందని, ఆ క్రేజ్‌ను గోపీచంద్ మలినేని సరిగ్గా ఉపయోగించుకుంటూ, బాలయ్యను నెక్స్ట్ లెవల్ యాక్షన్ స్టార్గా ప్రెజెంట్ చేయబోతున్నాడని ఫిలింనగర్ టాక్. అలా సింహం 111వ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయి కాబోతుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: