
ఈటీవీ విన్ ఒరిజినల్ గా రూపొందించబడిన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని భావించి ఈ మూవీని బన్నీ వాసు మరియు వంశీ నందిపాటి కలిసి థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది . ఇక కేవలం మూడు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో దాదాపు 30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు . ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .. మౌలికి ఇప్పుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది . ఏకంగా రెండో సినిమాకే కోటి రూపాయల రెమ్యూనిరేషన్ కూడా వారు ఆఫర్ చేసినట్లుగా సమాచారం .
నిజానికి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రెండో సినిమా దక్కించుకోవడమే గాగనం అయిపోతున్న ఈ రోజుల్లో మౌళి ఏకంగా రెండో సినిమాకే కోటి రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం చాలా ఈ విశేషమని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది . శతాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ పెద్దగా పాపులారిటీ రాకపోవడంతో కొందరు హీరోలు ఇప్పటికీ కూడా ఈ కోటి రూపాయల రెమ్యునరేషనే పుచ్చుకుంటున్నారు . అటువంటిది మౌలికి ఇది లాక్ అని చెప్పుకోవచ్చు .