
ఈ రోజు ఆదివారం, దీపావళి సెలవులు దృష్టిలో ఉంచుకుంటే వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యువతరాన్ని లక్ష్యంగా చేసుకున్న లైట్హార్ట్డ్ రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమా, ఫన్, ఫ్రెష్నెస్, ఫీలింగ్స్ మేళవింపుతో థియేటర్లలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ చిత్రం, రిలీజ్కు ముందే బిజినెస్ పరంగా లాభాలు తెచ్చుకుంది. డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ రూపంలోనే ప్రీ-రిలీజ్ బిజినెస్ మేకర్స్కు మంచి లాభాలు వచ్చాయి. ఈ దీపావళికి మిత్రమండలి - కే ర్యాంప్ - తెలుసు కదా తో పాటు పోటీగా వచ్చిన డ్యూడ్ పై మూడు సినిమాలను మించి బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే పెర్పామ్ చేస్తోంది.
సాయి అభయంకర్ స్వరపరచిన సంగీతం యువతను ఆకట్టుకుంటోంది. ఆర్. సారత్కుమార్, ఐశ్వర్య శర్మ, నేహా శెట్టి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత గ్లామర్, ఎంటర్టైన్మెంట్ జోడించారు. మొత్తానికి డ్యూడ్ దీపావళి సీజన్లో హిట్ ట్రాక్లో పయనిస్తోంది. ప్రభుదీప్ రంగనాథ్ కెరీర్లో ఇది మరో బిగ్ మైలురాయిగా నిలవనుంది. లాంగ్ రన్లో డ్యూడ్ అదరగొట్టే వసూళ్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.