మళ్లీ ఉద్యమ కాలం నాటి రోజులను ప్రజలకు గుర్తుకు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో తనకు బాగా తెలిసిన రీతిలోనే కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. తెలంగాణ జాతీయాలు వినిపిస్తూ ఆ ప్రాంత భాషలో ఉన్న సోయగాన్ని జోడిస్తూ చాలా మాటలే చెబుతున్నారు. కానీ కేసీఆర్ ను ఈ సారి మళ్లీ ప్రజలు నమ్ముతారా అన్నదే పెద్ద సందేహం. మాటలతో గారిడి చేస్తూ రాజకీయం చేసే కేసీఆర్ నమ్ముతారా అన్నదే ఇంకా పెద్ద సందిగ్ధం. ఈ తరుణాన కేసీఆర్ ఒక సేఫ్ జోన్ లో ఉంటూ కేంద్రం పై యుద్ధం చేయడం వల్ల సాధించేదేంటి? అలా అయితే ఇంత కాలం ఆయన నోరు మెదపక ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని? ఇవన్నీ ఆలోచిస్తే తెలంగాణలో ఇంటి పార్టీ వైభవం క్రమ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. కేసీఆర్ పర్సనల్ ఇమేజ్ కూడా అలా అలా తగ్గి పోతూనే ఉంది. గతంలో చెప్పిన విధంగా కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు.
ఇదే దశలో కొద్దో గొప్పో బీజేపీనే రాణిస్తోంది. కాంగ్రెస్ కు అస్సలు కోలుకునే శక్తే లేకుండా పోతోంది. కాంగ్రెస్ తరఫున రేవంత్ గొంతుక వినిపించినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఢిల్లీ కేంద్రంగా ఏఐసీసీ సమీక్షా సమావేశాల్లోనూ నువ్వెంత అంటే నువ్వెంత అని అధిష్టానం ఎదుటే కొట్టుకున్నారు టీపీసీసీ లీడర్లు. ఇలాంటి సీనియర్లు ఉన్న చోట కేసీఆర్ కు గెలుపు సులువే అయినా కొంతలో కొంత బీజేపీ బలం పుంజుకోవడం ఆయనను కలవరపాటుకు గురిచేస్తోంది.